ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనపై హర్షం
ముధోల్ ,మార్చ్ 9( ఇందూర్ నేత్రం ):
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు, తెరాస మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, ఆత్మ స్వరూప్, కో- ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖాలిద్, సర్పంచులు విజేష్, తెరాస నాయకులు పోశెట్టి, మురళి, గౌతమ్, అశోక్, సంజీవ్, సుధాకర్, రవి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు, తెరాస మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, ఆత్మ స్వరూప్, కో- ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖాలిద్, సర్పంచులు విజేష్, తెరాస నాయకులు పోశెట్టి, మురళి, గౌతమ్, అశోక్, సంజీవ్, సుధాకర్, రవి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.