మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి --ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

 మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

--ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి 







ముధోల్,మార్చ్ 6 ( ఇందూర్ నేత్రం ):

మహిళలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు సమాజంలో గుర్తింపు ఉంటుందని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు  అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాల  అద్దె కేంద్రం ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మండల సమైక్య రుణాల చెల్లింపు రికవరీలో రాష్ట్రస్థాయిలోనే వరుసగా నాలుగుసార్లు అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. రూ. 17 లక్షల 91 వేల తో వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే సూపర్ మార్కెట్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అదేవిధంగా మహిళా దినోత్సవ సందర్భంగా ఎంపీపీ అయేషా ఆఫ్రోజ్ ఖాన్ సమైక్య అధ్యక్షురాలు నాగమణి,సీసీ జ్యోతి, డి పి ఎం శోబా రాణి కి ఐకెపి సిబ్బంది సన్మానించడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎంపీపీ అయేషా ఆఫ్రోజ్ ఖాన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకటాపురం రాజేందర్, ఎఎంసి చైర్మన్ కృష్ణ, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ గోవిందరావు,డిపిఎం శోభారాణి,ఆర్ ఎమ్ రాందాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి, ఏపీఎం అశోక్, సీసీలు వందేమాతరం, జ్యోతి, పోశెట్టి, సూర్యకాంత్, నాయకులు నాగేష్ శాస్త్రి, ఎస్డి ఖాలిద్,  రాజన్న, సంజీవ్, మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image