దేశ్ కి నేత కేసీఆర్...
ఆట మొదలైంది...
-ప్రతిపక్షల భరతం పడుతాం...
- అభివృద్ధి పై విమర్శలు చేస్తే తరిమి కొడతాం..
- జిల్లాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
- జిల్లా తెరాస అధ్యక్షుడుగా జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం..
- ఇది ఆరంభం..మాత్రమే..
-తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి హెచ్చరిక..
నిజామాబాద్ ప్రతినిధి,ఫిబ్రవరి17 ( ఇందూర్ నేత్రం ):రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని నూతనంగా తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు.గురువారం నగరంలోని కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.. అంతకుముందు తెరాస నూతన అధ్యక్షుడికి ఇండల్వాయి గెట్ నుండి నగరంలో కలెక్టరేట్ మైదానం వరకు సుమారు రెండు వేల కార్లతో,పదివేల మంది ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని అన్నారు. కేసీఆర్ కు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని,అది డబ్బుతో కొనలేని ప్రేమ అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,దేశానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.జీవన్ రెడ్డి లాంటి యువ ఎమ్మెల్యే ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షా లను ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీ ఓర్వలేక పోతున్నదని,అందుకే కుట్రలకు తెరలేపారన్నారు.రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్న బిజెపి కిషన్ రెడ్డి, బండి సంజయ్,అర్వింద్ తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీని, అమిత్ షా ను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
.తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బిజెపి పార్టీ మనకు అవసరం లేదని అన్నారు.తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు.అంతకుముందు టిఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశ్ కి నేత కేసీఆర్ అన్నారు.కేసీఆర్ జన్మదినవేడుకలు జరుపుకోవడం,నేను జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు.మన రాష్ట్రంలో అనేక సంక్షేమపథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు. మన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారని,అభివృద్ధి ని విమర్శలు చేస్తే గ్రామాల నుండి తరిమి కొడతాం అన్నారు.ఈ జన్మదినవేడుకలలో ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త,బోధన్ ఎమ్మెల్యే షకీల్,జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ వీజీ గౌడ్,మాజీ ఎమ్మెల్సీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.